సూపర్ హిట్ సిరీస్ రాజు గారి గదికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం రాజు గారి గది 3.  ఆశ్విన్ బాబు , అవికా గోర్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని  ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్  డైరెక్ట్ చేశాడు.  హర్రర్ కామెడీ  నేపథ్యంలో  తెరకెక్కిన ఈచిత్రం  నిన్న విడుదలై  మిక్సడ్ రివ్యూస్ ను  సొంతం చేసుకుంది.  సాలిడ్ స్టోరీ లేకపోవడం, లాజిక్ లేని సన్నివేశాలతో ఈ చిత్రం  ప్రేక్షకులను  పూర్తి స్థాయిలో  ఎంటర్ టైన్ చేయలేకపోతుంది. అయితే సెకండ్ లో వచ్చే  కామెడీ ఎపిసోడ్  సినిమా ను  కొంత వరకు  కాపాడింది. కామెడీ వర్క్ అవుట్ కావడంతో  ఈచిత్రం మొదటి రోజు  తెలుగు రాష్ట్రాల్లో 1.25కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం యొక్క బడ్జెట్ ను బట్టి చూస్తే  సినిమాకు మంచి ఓపెనింగే వచినట్లు.  ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈలెక్కన ఈసినిమా  మరో వారం రోజులు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తే  బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం. 



ఇక ఈ చిత్రంతో పాటు నిన్న విడుదలైన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ , కృష్ణరావు సూపర్ మార్కెట్ చిత్రాలకు డిజాస్టర్  టాక్ రావడం అలాగే సైరా కూడా  నెమ్మదించడంతో   దీపావళి వరకు రాజుగారి గది 3కి బాక్సాఫీస్ వద్ద ఎదురువుండదు. ఓంకార్ సొంత ప్రొడక్షన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి  చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందించగా సాయి మాధవ్ బుర్ర  డైలాగ్స్ ను అందించాడు. 


తెలుగు రాష్ట్రాల్లో  ఏరియాల వారీగా ఈ చిత్రం యొక్క వసూళ్ల వివరాలు 

నైజాం : 42 లక్షలు 
సీడెడ్ : 24 లక్షలు 
గుంటూరు :14 లక్షలు 
కృష్ణా : 9 లక్షలు 
పశ్చిమ గోదావరి : 6 లక్షలు 
తూర్పు గోదావరి : 10 లక్షలు 
వైజాగ్ : 16 లక్షలు 
నెల్లూరు : 4 లక్షలు 
ఏపీ &తెలంగాణ లో మొదటి రోజు షేర్ మొత్తం =1.25కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: