నటిగా రాధిక శరత్ కుమార్ అందరికి సుపరిచితురాలే.తన నటనా ప్రతిభతో ఎప్పుడో ప్రేక్షకులను అలరించి,మెప్పించారు రాధిక.అటు వెండితెరపై సినిమాలు,ఇటు బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నారు రాధిక.తాజాగా ఇప్పుడు ఆమె,కొంత మంది ప్రేక్షకులను,అభిమానులను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నారు.అసలు విషయం ఏమిటంటే,తాను బిగ్ బి అమితాబ్ వ్యాఖ్యాత వచించిన  కౌన్ బనేగా కరోడ్‌ పతి,లానే తాను ఓ క్విజ్ ప్రోగ్రాం ని హోస్ట్ చెయ్యనున్నారు.క్విజ్ లో   క్వశ్చన్స్‌కు సరైన సమాధానాలు చెబితే  చాలు,మీరే కోటీశ్వరులు అంటూ షో ని రెడీ చేసారు. 

ఈ షోకి మరో విశేషం ఏంటంటే,ఇందులో కేవలం మహిళలు మాత్రమే ఎంట్రీ.  బిగ్ బి అమితాబ్ హోస్ట్‌  చేసిన పాపులర్‌ టీవీ షో, కౌన్‌ బనేగా కరోడ్‌ పతి మాదిరిగానే ఈ షో కూడా  డిజైన్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ షోకు సంబంధించిన ఫొటోషూట్‌  కూడా జరిగినట్టు తెలుస్తున్నాయి.ఫోటోషూట్ లో రాధిక హుందాగా కనిపించారు అంటున్నారు నెటిజన్లు.డిసెంబరు మొదటివారం నుండి, ప్రముఖ టీవీ చానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది అని చెప్తున్నారు.ఈ షోకు ‘కోడీశ్వరి’ అనే పేరు కూడా ఖరారు అయినట్టు చెప్తున్నారు. తమిళ్ భాషలో  కోడీశ్వరి అంటే,కోటీశ్వరి అని అర్థం వస్తుంది అని  చెప్తున్నారు సదరు షో యూనిట్ సభ్యులు.

కౌన్ బనేగా కరోడ్‌పతి బాటలో కోలీవుడ్‌లో ‘కోడీశ్వరి’షోను ప్రారంభించనున్నారు. ఈ షోలో కేవలం మహిళలకే  అవకాశం కల్పించనున్నారు. షోకు సంబంధించిన ఫొటో షూట్ కూడా  పూర్తి అయింది అని,హోస్ట్‌గా   ఉన్న రాధిక ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వచ్చే వారం నుండి ఈ షోలో పాల్గొనే వారిని ఎంపిక చేయనున్నారు.ఇప్పటివరకూ  అటు వెండి తెర మీద,ఇటు  బుల్లి తెర నటిగా అలరించిన రాధిక శరత్ కుమార్ ,ఇప్పుడు  హోస్ట్‌గా ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటారో చూడాలంటే,వేచి ఉండాల్సిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: