ఇటీవల విడుదలైన ఇస్మార్ట్
శంకర్ సినిమాకి
నిధి అగర్వాల్ కథానాయకిగా చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం జరిగింది. ఇక
నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి.
తాజాగా
నిధి అగర్వాల్.. మంచు లక్ష్మీ వీట్ అనే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్’ షో లో క్రికెటర్ కే.ఎల్.రాహుల్తో తనకున్న సంబంధం విషయమై వస్తున్న పుకార్లకు స్పందించింది. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్తో నేను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న సమాచారాన్ని తిప్పి కొట్టింది. మేమిద్దరం మంచి స్నేహితులము మాత్రమే.. మా మధ్య ఫ్రెండ్షిప్ తప్పించి మరోటి ఏమి లేదని తెలియచేసింది లక్ష్మితో.
ఇక
రాహుల్ పరిచయం గురించి ఇలా చెప్పుకొని వచ్చింది. అప్పుడు నేను లండన్లో ఉండే దాన్ని
పాకిస్థాన్ పై భారత్
క్రికెట్ మ్యాచ్ గెలిచింది. ఆ సందర్భంలో నేను భారత
క్రికెట్ బృందాన్ని కలిసి విషెస్ తెలిపాను. అపుడే నేను కేఎల్ రాహుల్ను కలవడం జరిగింది అని తెలిపింది. నాకు
రాహుల్ బాగా తెలుసు. మా గురించి వస్తున్న పుకార్లు ఎంత మాత్రం నిజం కాదు అని తెలియచేసింది.
.
గతంలో ఈ
భామ బాలీవుడ్ లో మున్నా మైఖేల్ అనే సినిమాలో కూడా నటిచింది. ఈ
భామ చిత్ర పాత్రలో గ్లామర్ షోతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాతికేళ్ల
భామ పుట్టింది అక్కడో కాదు మా హైదరాబాద్లోనే. ఇక సినిమాలు, రూమర్ల సంగతి పక్కన పెడితే.. నిధికి నచ్చిన తాను మెచ్చిన మోడలింగ్లో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది ఈ భామ.