మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. గత ఏడాది మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజు తొలి ఆట నుండి అద్భుతమైన టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకెళ్లి, ఓవర్ ఆల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సహా మిగతా అందరు నటీనటుల అత్యద్భుత నటన, 1980 ల కాలం నాటి సెట్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, గ్రాండియర్ గా ఉన్న విజువల్స్ తో పాటు సంగీతం కూడా సినిమా అద్భుత విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించాయి. 

ఇక యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విపరీతంగా అలరించాయని చెప్పాలి. ఇక ముఖ్యంగా సమంత మరియు రామ్ చరణ్ ల పై కొంత ఫన్నీగా పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన రంగమ్మ మంగమ్మ సాంగ్ అయితే మరింత ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన తరువాత మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్, నేటితో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని ఒక గొప్ప రికార్డుని సొంతం చేసుకుంది. 

ఈ సాంగ్ ఇంత గొప్ప ఫీట్ ని ఎచీవ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ న్యూస్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకున్న రంగస్థలం సినిమా, ఈ విధంగా యూట్యూబ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ సాధిస్తూ దూసుకెళ్తుండడం ఒకరకంగా విశేషం అని చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా పని చేయగా, విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ గా నటించారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: