సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు తో సంబంధం లేకుండా  వరుసగా సినిమాలు  చేస్తూ యంగ్ హీరోలకు  గట్టి పోటీనిస్తున్నాడు. రజినీ ఈ ఏడాది  ప్రారంభంలో పేట తో ప్రేక్షకులముందుకు రాగ ఆ చిత్రం విజయాన్ని సాధించింది. ఇక పేట తరువాత పెద్దగా గ్యాప్ తీసుకుకుండా  రజినీ వెంటనే  స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  ఆయనకు జోడిగా నయనతార నటించింది.  రజినీ-మురగదాస్  కాంబినేషన్ లో వస్తున్న  మొదటి సినిమా  కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.  వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. 



ఇదిలా ఉంటే ఈసినిమా సెట్స్ మీద వుండగానే   ఇటీవల అజిత్  తో  విశ్వాసం అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన  మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో నటించడానికి తలైవా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం లాంఛ్ కానుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఈ చిత్రానికి ప్రస్తుతం హీరోయిన్స్ ను వెతికే పనిలో  వున్నారు చిత్ర బృందం.  అందులో భాగంగా సీనియర్ నటి జ్యోతిక , మలయాళ నటి మంజూ వారియర్,  ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ పేర్లు పరిశీలనలో వున్నాయి.  ఇందులో నుండి ఇద్దరిని  ఫైనల్ చేయనున్నారని సమాచారం. ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: