యువ హీరో నితిన్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డాడని చెప్పొచ్చు. శ్రీనివాస కళ్యాణం సినిమా పై అంచనాలు పెట్టుకోగా ఆ సినిమా కాస్త నిరాశపరచింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్. లేటెస్ట్ గా నితిన్ ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు నితిన్.


ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అసలే తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉన్న రష్మిక నితిన్ సరసన చేయడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో నితిన్ రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రం ముహుర్తానికి వచ్చి మరి సినిమా యూనిట్ అంతటికి బెస్ట్ విషెస్ అందించాడు.


ఇక ఈ సినిమాతో పాటుగా నితిన్ చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను త్వరలోనే లైన్ లో పెట్టనున్నాడట. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తుందట. మొత్తానికి వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నాడు నితిన్. భీష్మ సినిమా అసలైతే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చూశారు కాని ఆ టైం కు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయని దాన్ని వాయిదా వేశారు.


ఇభీష్మ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాతో పాటుగా రన్ దే సినిమాను కూడా 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ మొత్తం నితిన్ హవా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. భీష్మ, రన్ గేనే కాదు చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా డిఫరెంట్ కథతో వస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ హిట్ పక్కా అంటున్నారు. మరి రానున్న 3 సినిమాలతో నితిన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: