నాగార్జున వారసుడిగా మొదటిసారి మనం సినిమాలో కనిపించిన అఖిల్, ఆ తర్వాత సోలో హీరోగా యాక్షన్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమా "అఖిల్". తన పేరునే సినిమా టైటిల్ గా పెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో కావల్సినంత యాక్షన్ తో పాటు, అఖిల్ డాన్స్ లు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడలేదు.


దాంతో అఖిల్ తన రెండవ ప్రయత్నంగా ప్రేమ కథతో వద్దామని డిసైడ్ అయ్యి మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో " హలో" అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ కావడంతో తన నాలుగవ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. చాల రోజులుగా నాలుగవ సినిమా స్టార్ట్ చేయడానికి హీరోయిన్ దొరకలేదు. అయితే ఎట్టకేలకు నాలుగవ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు.


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా అఖిల్ ఇంకో సినిమాకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తుంది తమిళ దర్శకుడని సమాచారం. ఆ తమిళ దర్శకుడు ఎవరో కాదు పి ఎస్ మిత్రన్. మిత్రన్, అఖిల్ కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నట్టు పొయిన యేడాది నుండే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మిత్రన్ హైదరాబాద్లో అఖిల్ ను కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.


ప్రస్తుతం మిత్రన్ శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో ‘హీరో’ అనే చిత్రం చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే అఖిల్ సినిమా పనులు స్టార్ట్ చేస్తాడని, అఖిల్ కూడా భాస్కర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే మిత్రన్ సినిమాతో జాయిన్ అవుతాడని వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలియాలంటే అఖిల్ లేదా మిత్రన్ నుండి క్లారిటీ రావాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: