భరత్ అనే నేను, మహర్షి సినిమాల విజయంతో మహేష్ బాబు మంచి ఊపుమీదున్నాడు.  ఈ రెండు సినిమా విజయం తరువాత మహేష్ బాబు పక్కా ఎంటర్టైనర్ సినిమా సరిలేరు నీకెవరు సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా కు సంబంధించిన ఒక్కో ఫోటో న్యూస్ బయటకు వస్తున్నది.  సినిమా కు సంబంధించిన స్టిల్స్ చూస్తుంటే సినిమా మరో రేంజ్ లో ఉండేలా కనిపిస్తోంది. ఆర్మీ ఆఫీసర్ గా ఉండే అజయ్ కృష్ణ.. కాశ్మీర్ నుంచి కర్నూల్ ఎందుకు వచ్చాడు.  


కర్నూల్ అయన చేసిన హంగామా ఏంటి అన్నది సినిమా.  ఈసినిమాను పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.  కథలో మంచి డెప్త్ ఉన్నట్టుగా తెలుస్తోంది.  మరలా మంచి కథా చిత్రాలను తెరపై చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది .  ఇందులో రష్మిక మందన్న హీరోయిన్.  తమన్నా, పూజా హెగ్డేలు ప్రత్యేక నృత్యాల్లో నటిస్తున్నారు.  ఈ ఇద్దరు స్టార్స్ గతంలో మహేష్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.  


ఇకపోతే, ఇందులో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.  ఆమె పాత్ర హైలైట్ గా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది.  ఈ సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. కాగా, అదే రోజున ఈ సినిమాతో పాటుగా బన్నీ అల వైకుంఠపురంలో సినిమా కూడా రిలీజ్ అవుతున్నది.  


రెండు పెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు.  రెండింటికి మంచి పేరు ఉన్నది.  ఇలాంటి పెద్ద సినిమాలు రెండు ఒకే రోజున రిలీజ్ అయితే దాని వలన కొన్ని ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి.  రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేస్తే ఏ సినిమా చూడాలో అర్ధంగాక ప్రేక్షకుడు అయోమయంలో పడిపోతాడు.  అందుకే ఒక సినిమాను ముందు వస్తే బాగుందని అనుకున్నారు.  ఇందులో భాగంగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా జనవరి 12 కాకుండా ఒక రోజు ముందుగా అంటే జనవరి 11 న రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.  జనవరి 10 న రజినీకాంత్ దర్బార్, జనవరి 11 న సరిలేరు నీకెవ్వరూ, జనవరి 12 న ఆలా వైకుంఠపురంలో ఇలా వరసగా సినిమాలు ఉండబోతున్నాయి.  ఒక్కరోజు గ్యాప్ తో వస్తున్నది కాబట్టి సినిమా బాగుందని టాక్ వస్తే తప్పకుండా అన్ని సినిమాలు హిట్ అవుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: