తెలుగు అమ్మాయిలకు సినిమా ఛాన్సులివ్వరని చాలామంది వాపోతుంటారు. ఎంత సేపటికి ముంబాయ్ నుండి మోడల్స్ ని తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకుంటారని తెలుగమ్మాయిలు దర్శక, నిర్మాతల కళ్ళకు కనిపించరని వాదన ఒకటుంది. అయితే లయ అనే అమ్మాయి తెలుగమ్మాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసి గ్రేట్ అనిపించుకుంది. అలానే ప్రస్తుతం  ఈషా రెబ్బ అనే అమ్మాయి కూడా అచ్చ తెలుగు తెలంగాణా అమ్మాయి. తను సక్సస్ ఫుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ జాబితాలో మరో తెలుగు అమ్మాయి కూడా చేరింది. తనే తెనాలి అమ్మాయి శోభిత దూళిపాళ్ల. 2016లో హిందీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

అప్పటి నుండి శోభిత అక్కడే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంది. 2018లో శోభిత తెలుగులో 'గూఢచారి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో నటించాలని ఉందంటూ శోభిత ఎంతగానో ఆరాటపడింది. కాని గూఢచారి సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఆమెకు ఛాన్స్ లు రాలేదు. అయినా కూడా ప్రస్తుతం ఒక మలయాళ సినిమా, రెండు హిందీ సినిమాలు చేస్తున్న శోభిత చాలా బిజీగా ఉంది. తెలుగులో ఛాన్స్ లు రాకపోవడంతో పూర్తిగా హిందీపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో శోభిత దూళిపాళ్ల ను తెలుగు నిర్మాతలు సంప్రదించారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా శోభితను ఎంచుకుందామన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజా సమాచారం.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తరపున శోభితను కలవడం.. ఆమెకు స్క్రిప్ట్ చెప్పడం కూడా జరిగిందని త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో శోభిత నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. గూఢచారితో చిన్న పాత్రలో మెరిసిన తెలుగమ్మాయి మరోసారి టాలీవుడ్ సినిమాలో నటించడం కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమాతోనైనా శోభిత టాలీవుడ్ లో సెటిలవుతుందా లేక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో సినిమా కోసం ఎదురుచూస్తుందా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: