మాములుగా పండుగ వచ్చింది అంటే స్టార్ హీరో సినిమాల మధ్య పోటీ చూస్తుంటాం కాని ఇప్పుడు పరిస్థితి మారింది. డైరెక్టర్స్ పోటీ కాదు ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ మోస్ట్ ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఎస్ ఎస్ థమన్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. కొన్నాళ్లుగా దేవి తన మార్క్ మ్యూజిక్ ఇవ్వట్లేదు అన్న టాక్ బాగా వచ్చింది.

 

ఈ గ్యాప్ లో థమన్ తన మ్యూజిక్ తో అందరిని అలరిస్తున్నాడు. కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన థమన్ తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలాఉంటే రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సాంగ్ అదిరిపోయింది..థమన్ టాలెంట్ ఏంటో మరోసారి ఆ పాటతో తెలిసింది.

 

అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మహేష్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒక రకంగా స్టార్ హీరోలతో పాటుగా ఈ ఇద్దరి మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.

 

ఆల్రెడీ థమన్ తన సినిమా నుండి ఒక మెలోడీ సాంగ్ వదలగా ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అయితే మహేష్ సినిమా తో దేవి మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతారని అంటున్నారు. ఓ విధంగా ఈమధ్య తన ఆల్బమ్స్ తో థమన్ దేవికి గట్టి పోటీ  ఇస్తున్నాడు. మరి ఫైనల్ గా ప్రేక్షకుల మనసు గెలిచేది ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: