సంక్రాంతి రేస్ మహేష్ బన్నీల మధ్య ఫిక్స్ కావడమే కాకుండా వారి రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవుతున్న పరిస్థితులలో వీరిద్దరి మధ్యా రాయబారాలు చేసి ఈపోటీని సుఖాంతం చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ మూవీ డేట్ మారుతుంది అంటూ వదులుతున్న ఫీలర్స్ కు బన్నీ వ్యూహాత్మక సమాధానాలు ఇస్తున్నాడు. 

‘అల వైకుంఠపురంలో’ డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుండి ఈమూవీకి సంబంధించిన ఒక స్టిల్ విడుదల చేయడమే కాకుండా ఆ స్టిల్ పై జనవరి 12న విడుదల అంటూ స్పష్టంగా ఒకటికి రెండుసార్లు ప్రకటిస్తూ తాను వార్ కు రెడీ అన్న సంకేతాలు బన్నీ చాల స్పష్టంగా ఇస్తున్నాడు. ఈ సంకేతాలు ఇప్పుడు ఈ రెండు సినిమాలను తీస్తున్న నిర్మాతలకు తల నొప్పిగా మారినట్లు టాక్. 

ఈపోటీ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఈ రెండు సినిమాలను కొనడానికి ఇప్పటికే ఎగ్రిమెంట్స్ చేసుకున్న బయ్యర్లు ఈ రెండు మూవీలు ఒకేరోజు విడుదలైతే ఒకరేటు వేరువేరు డేట్స్ లో గ్యాప్ తో విడుదల అయితే వేరే రేటు అంటూ బేరసారాలు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బేరాలతో అటు బయ్యర్లకు నచ్చచెప్పలేక ఇటు మహేష్ బన్నీల ఇగోను సరిదిద్దలేక ఈ మూవీ నిర్మాతలు మౌన పాత్రను పోషిస్తున్నట్లు టాక్. 

వాస్తవానికి తమ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవ్వడం మహేష్ కు బన్నీకి ఇష్టం లేకపోయినా తమ సినిమాను వెనక్కు కాని ముందుకు కానీ తీసుకు వెళితే తాము భయపడ్డాము అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి వీరిద్దరూ ఈ విషయమై ప్రస్తుతానికి మౌనముద్ర వహించినట్లు తెలుస్తోంది. ఈమౌన ముద్రను తమకు లాభసాటిగా మలుచుకోవాలని ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీ బయ్యర్లు ఆడుతున్న గేమ్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: