తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడమే మానేశారు. ఒకప్పుడు అందరూ తెలుగు వాళ్లే కనిపించే వారు. ఇప్పుడు తెల్ల తోలని చెప్పి నార్త్ నుండి తీసుకురావడం వల్ల తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే మన హీరొయిన్లు ఇక్కడ సినిమాలు చేయకపోయినా వేరే భాష చిత్రాల్లో మెరుస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ మన వాళ్ళు ముందుగా రచ్చ గెలిచి వస్తున్నారు.


అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ. శోభిత ధూళిపాళ్ల తెనాలికి చెందిన తెలుగమ్మాయి. ఈమె 2016లో హిందీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అప్పటి నుండి శోభిత అక్కడే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంది. 2018లో ఈ అమ్మడు తెలుగులో అడవిశేష్ హీరోగా చేసిన 'గూఢచారి' చిత్రంతో నటించి  మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా కూడా  మంచి విజయం సాధించింది. 


దాంతో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలని శోభిత కోరుకుందట. కాని గూఢచారి చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో ఆమెకు ఛాన్స్ లు రాలేదు. దాంతో మళ్ళీ బాలీవుడ్ కి పయనమయ్యింది. అక్కడ సినిమాలు చేస్తూనే ఒక వెబ్ సిరీస్ లోనూ నటించింది. ప్రస్తుతం శోభిత ఒక మలయాళం సినిమా రెండు హిందీ సినిమాలు చేస్తున్న శోభిత చాలా బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు నిర్మాతలు ఆమెను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.


సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాణం జరుగబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా శోభితను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తరపున శోభితను కలవడం.. ఆమెకు స్క్రిప్ట్ చెప్పడం కూడా జరిగిందని త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో శోభిత నటించేందుకు ఓకే చెప్పడం కూడా జరిగి పోయిందట. ఈ విషయమై ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదు. మరి శోభితకి ఛాన్స్ వచ్చి, ఆమె అనుకున్నది నెరవేరుతుందా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: