స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో.. ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ చిత్రం లోని  రాములో రాముల అనే సాంగ్  ప్రోమో  ఈ రోజు సాయంత్రం 4.05గంటలకు  విడుదలకావాల్సి వుంది.  కానీ టెక్నీకల్  సమస్యల వల్ల ఈ ప్రోమో  విడుదల వాయిదా పడింది.   రేపు సాయంత్రం అదే సమయానికి  ఈ ప్రోమో విడుదలకానుంది. ఫుల్ సాంగ్ మాత్రం దీపావళికి రిలీజ్ అవుతుంది. ఇక ప్రోమో  విడుదల వాయిదాపడడం తో బన్నీ అభిమానులు  అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ ల్లో ఒకటైన  హారిక హాసిని  క్రియేషన్స్ పై వారు ఫైర్ అవుతున్నారు.  ప్రచార చిత్రాలను  చెప్పిన టైం కు రిలీజ్ చేయకపోవడం ఆ సంస్థ కు అలవాటేనని సోషల్ మీడియాలో  కామెంట్లు చేస్తున్నారు. 





ఇక ఈ  చిత్రం నుండి ఇటీవల  విడుదలైన  'సామజవరగమన' సాంగ్  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్ ను తెచ్చుకుని సాంగ్ అఫ్ ది ఇయర్ గా నిలిచింది.  ప్రస్తుతం యూ ట్యూబ్ లో  ఈసాంగ్ 45 మిలియన్ల పై చిలుకు  వ్యూస్ ను రాబట్టుకోవడమే కాకుండా  అత్యధిక  లైక్స్ తెచ్చుకున్న మొదటి తెలుగు సాంగ్ గా  రికార్డు సృష్టించింది.  ఈ  ఒక్క సాంగ్ తో సినిమా పై  అంచనాలు  తారాస్థాయికి చేరుకున్నాయి.   పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ చిత్రం విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: