ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎన్నో సినిమాలను నిర్మించారు. ఎన్నో సినిమాలను నిర్మించిన సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు బెల్లంకొండ సురేష్. అయితే బెల్లంకొండ సురేష్ మొదటి కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని  టాలీవుడ్ కి  హీరోగా పరిచయం చేశారు ఆయన. అయితే టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్... ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేసినప్పటికీ ఆయనకు సరైన స్టార్ డమ్  మాత్రం దక్కలేదు. అయితే తాజాగా ఆయన నటించిన రాక్షసుడు మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆ సినిమాలు హీరో సాయి శ్రీనివాస్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సినిమా భారీ విజయం సాధించింది. 

 

 

 

 కాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇప్పుడు తాజాగా తన రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తుండగా... బీటెల్  లీఫ్  ప్రొడక్షన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి వివేక్  ఆత్రేయ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత కూతురు నటిస్తుంది... అదేంటి సమంతకు పిల్లలే లేరు కదా అనుకుంటున్నారు కదా. రియల్ లైఫ్ లో సమంత కూతురు కాదు...  రీల్ లైఫ్ లో సమంత కూతురు. తాజాగా సమంత నాగచైతన్య కు జోడిగా నటించిన చిత్రం మజిలీ . 

 

 

 

 

 అయితే ఈ సినిమాలో అనన్య సమంతకు కూతురిగా నటించిన విషయం తెలిసిందే. ఒక యువ  క్రికెటర్ గా  అనన్య తన పాత్రలో అదరగొట్టింది. ఇక ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సాయి గణేష్ చిత్రం తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అనన్య . అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బెల్లంకొండ సాయి గణేష్ చిత్రంలో హీరోయిన్ గా అనన్య  ను కన్ఫర్మ్  చేసింది చిత్రబృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: