దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తున్న ఈ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులైలో రిలీజ్ చేయనుంది సినెమా యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కూడా మరొక ప్రాజక్ట్ ఓకే చేయకూడదని మొదట్లోనే నిర్ణయించామని, ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు చెప్పడం జరిగింది. 

అయితే ఇప్పుడు ఇదే వారికి కొంత సమస్యగా పరిణమిస్తోందట. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏంటంటే, కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, తమ బ్యానర్ పై కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నారని, అవకాశం ఉన్నంత త్వరగా ఆ ప్రాజక్ట్ ని సెట్స్ పైకి తీసుకువస్తాం అని చెప్పడం జరిగింది. అలానే ఇటీవల ప్రశాంత్ కూడా హీరో ఎన్టీఆర్ ను కలిసి ఒక కథ చెప్పారని, ఆ కథ తనకు ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో ఆయన కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. 

దానితోపాటు ప్రశాంత్ మధ్యలో మహేష్ బాబును కూడా కలిసారని వార్తలు రావడం జరిగింది. అంతేకాక తాను చెప్పిన కథ మహేష్ కు నచ్చిందని సమాచారం. అయితే ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూల్స్ ప్రకారం ఎన్టీఆర్ మరొక ఏడు నెలల వరకు అందుబాటులో ఉండరని, అయితే తన కెజిఎఫ్ షూటింగ్ మార్చి కల్లా పూర్తి అయిపోవడంతో, తదుపరి సినిమాని మహేష్ తోనే చేయాలని భావిస్తున్నాడట ప్రశాంత్ నీల్. సో, దీని ప్రకారం మహేష్ 27వ మూవీకి దర్శకుడిగా ప్రశాంత్ ఫిక్స్ అయినట్లే అని నేడు ఉదయం నుండి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: