సాహో సినిమా తరువాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ కలిసి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇదే టైటిల్ తో నిర్మాతలు జాన్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 
 
మరోవైపు దిల్ రాజు నిర్మాతగా సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో 96 చిత్రం రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో సమంత పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సినిమాకు జాను అనే టైటిల్ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాస్, రాధాకృష్ణ సినిమా 2020 సెకండాఫ్ లో విడుదల కాబోతూ ఉండగా సమంత, శర్వానంద్ సినిమా మరో మూడు నాలుగు నెలల్లో విడుదల కాబోతుందని సమాచారం. 
 
96 రీమేక్ తెలుగులో జాను అనే పేరుతో ప్రభాస్ సినిమా కన్నా ముందుగా విడుదలైతే ప్రభాస్ సినిమా టైటిల్  జాన్ కు క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. జాన్, జాను పేర్లు ఒకే విధంగా ఉండటంతో ప్రేక్షకులు కూడా కొంత తికమక పడే అవకాశం ఐతే ఉంది. సమంత సినిమానే ముందుగా రాబోతూ ఉండటంతో ప్రభాస్ సినిమాకు షాక్ తప్పదని తెలుస్తోంది. కానీ ఈ రెండు టైటిల్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు సినిమాకు టైటిల్ మార్చుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రభాస్ జాన్ సినిమాను నిర్మాతలు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాకు 180 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నా సాహో సినిమాకు నష్టాలు రావటంతో ఈ సినిమా బడ్జెట్ ను నిర్మాతలు తగ్గించారని సమాచారం. ఇప్పటికే జాన్ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: