ఛలో సినిమాతో టాలీవుడ్కు పరిచయమయింది
రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న
రష్మిక వరుస అవకాశాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. ఇప్పటికే సూపర్ స్టార్
మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తున్న రష్మిక, బాలీవుడ్ లో ఎంటర్వడానికి కూడా రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ కన్నడ బ్యూటీకి ఓ అగ్ర నిర్మాత షాక్ ఇచ్చినట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నరష్మిక దిల్ రాజు బ్యానర్లో రెండు సినిమాల్లో నటించేందుకు కమిటయిందట.
నాగ చైతన్య హీరోగా శశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్గా
రష్మిక మందన్నను ఫైనల్ చేసుకున్నారట చిత్రయూనిట్.
ప్రస్తుతం సూపర్ స్టార్స్ సరసన నటిస్తూ ఫుల్ ఫాంలో ఉన్న రష్మిక..
నాగ చైతన్య సినిమాలో నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో దిల్ రాజు.. రష్మికను కాదని మరో హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు
నాగ చైతన్య సినిమాకు ఓకె చెప్పడానికి కూడా
రష్మిక నిర్మాతని ఇబ్బంది పెట్టిందన్న టాక్ కూడా రీసెంట్గా వచ్చింది. అయితే
రష్మిక నాగ చైతన్య సినిమా విషయంలో ప్రవర్తించిన తీరు నచ్చకపోవడంతో దిల్ రాజు ఆమెకి మరో భారీ షాక్ ఇచ్చాడు. షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కనున్న సినిమాకు రష్మికను హీరోయిన్గా తీసుకున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రలో
రష్మిక నటించాల్సి ఉంది. అయితే
రష్మిక నాగ చైతన్య సినిమాకు నో చెప్పటంతో దిల్ రాజు, జెర్సీ రీమేక్ నుంచి కూడా
రష్మిక ను తప్పించినట్టుగా తెలుస్తోంది. మిగతా భాషల విషయంలో సినిమా అవకాశాలు బాగా వస్తున్నప్పటికి రష్మికకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది మాత్రం టాలీవుడ్ అన్న విషయం ఎవరైనా చెప్తారు. అలాంటిది టాలీవుడ్లో టాప్ బ్యానర్ రష్మికను తమ సినిమాను నుంచి తప్పించటంతో ఆమె కెరీర్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం
రష్మిక తెలుగులో సరిలేరు నీకెవ్వరు, భీష్మా సినిమాలతో పాటు తమిళ్లో సుల్లాన్, కన్నడలో పొగరు సినిమాల్లో నటిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా
సుకుమార్ తెరకెక్కించబోయే సినిమాలో కూడా
రష్మిక మందన్న నే హీరోయిన్గా నటించే అవకాశం ఉందని తాజా సమాచారం.