ప్రస్తుతం మన తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అవుతున్న క్రేజ్ షోల్లో ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ఇక ఈ షో ప్రారంభమైన తరువాత ఆ ఛానల్ వారికి రేటింగ్స్ కూడా బాగా పెరిగాయని చెప్పాలి. ఇక ఈ షో ద్వారా పలువురు నటులు తమలోని కామెడీ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించడం మొదలెట్టారు. ఇక ఈ షోలో మొదట చిన్న వేషాలతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చలాకి చంటి, రైజింగ్ రాజు, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను వంటివారు, నేడు ఎవరికి వారు ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసుకుని, తమ కడుపుబ్బా నవ్వించే హాస్యంతో మంచి ప్రేక్షకాధరణతో ఎంతో పేరు సంపాదించడం జరిగింది. 

ఇకపోతే ఈ షో నిర్వాహకులు పలు పెద్ద పండుగల సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరికొద్దిరోజుల్లో రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రసారం కానున్న ప్రత్యేక షోకు 'ఉత్తమ పురుషులు' అనే పేరు నిర్ణయించడం జరిగింది. ఇక ఆ షో తాలూకు ప్రోమో ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, మంచి వ్యూస్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఆ ప్రోమోలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, చలాకి చంటి లతో పాటు జడ్జిగా వ్యవహరించే నాగబాబు గారు కూడా ఒక నటుడిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక షోలో భాగంగా వారు ముగ్గురితో సరదాగా నాగబాబు మాట్లాడుతుండగా, 

మధ్యలో సుధీర్ అందుకుని, సర్ మేము త్వరలో హాయిగా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని అనగానే, దానికి వెంటనే నాగబాబు రియాక్ట్ అవుతూ, మీరు ముందు ఆ విధంగా చేసి జబర్దస్త్ నుండి వెళ్ళిపోతే బెటర్, షో హాయిగా సాగుతుందని అంటూ కొంత వార్నింగ్ ఇస్తూ సరదాగా సమాధానం ఇవ్వడంతో, వారు ముగ్గురుకి ఒక్కసారిగా షాక్ కొడుతుంది. ఇక ఈ విధంగా వారితో పాటు యాంకర్ సుమ గారు కూడా ఈ దీపావళి స్పెషల్ షోలో మంచి హాస్యం పండించబోతున్నట్లు ఈ ప్రోమోని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. కాగా ప్రస్తుతం ఆ స్పెషల్ ప్రోమో పలు సోషల్ మీడియా మద్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: