‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒకేసారి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని అంతా తన వైపుకు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ని ‘కబీర్ సింగ్’ గా మార్చి బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడ హాట్ టాపిక్ గా మారాడు. తెలుగులో అర్జున్ రెడ్డి తరువాత మహేష్ తో ఇతడి సినిమా ఉంటుంది అని ప్రచారం జరిగినా ఆమూవీ పట్టాలు ఎక్కలేదు.

ప్రస్తుతం ఈసంచలన దర్శకుడు ఎక్కువకాలం ముంబాయ్ లోనే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో సందీప్ రెడ్డి ఈమధ్య హైదరాబాద్ కు వచ్చి ఎమ్.ఎల్.ఎ కాలనీలోని తన ఆఫీసుకు వచ్చినట్లు తెలియగానే సందీప్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న చాలామంది మీడియాకు సంబంధించిన వాళ్ళు సందీప్ రెడ్డిని కలవడమే కాకుండా అతడితో అనేక విషయాలు మాట్లాడుతూ అతడు తెలుగులో చేయబోయే తదుపరి సినిమా గురించి విచారణ చేసినట్లు టాక్. 

ఈసందర్భంలో సందీప్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాకు లీక్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘అర్జున్ రెడ్డి’ కథ రెడీ అయిన తరువాత సందీప్ రెడ్డి ఆకథను మొదట్లో మంచు మనోజ్ కు ఆతతువాత శర్వానంద్ కు వినిపించినట్లు అప్పటి విషయాలను సందీప్ రెడ్డి తన మీడియా మిత్రులకు షేర్ చేసినట్లు టాక్. అయితే ‘అర్జున్ రెడ్డి’ కథ మంచు మనోజ్ కు శర్వానంద్ కు నచ్చక పోవడంతో చివరి ఆప్క్షన్ గా విజయ్ దేవరకొండకు వచ్చి చేరడం ఈ ప్రాజెక్ట్ కు అప్పట్లో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ దేవరకొండ చేత పెట్టుబడులు పెట్టించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నట్లు సమాచారం. ఇదేసందర్భంలో మరో షాకింగ్ న్యూస్ ను సందీప్ వంగ లీక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తాను చిరంజీవికి సరిపోయే ఒక సోషల్ మెసేజ్ ఉన్న ఒక పవర్ ఫుల్ స్టోరీని వ్రాసానని ఆకథను వినిపించడానికి తాను త్వరలో చిరంజీవిని కలవబోతున్న విషయాన్ని చెప్పినట్లు టాక్. ఈకథలో చిరంజీవి నటించినా నటించకపోయినా తనకు అభ్యంతరం లేదనీ కనీసం తన కథను చిరంజీవి వింటే చాలు అని తాను అభిప్రాయ పడుతున్నట్లు సందీప్ రెడ్డి తన కోరికను మీడియా మిత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను చిరంజీవిని కలవడానికి చరణ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్న విషయం లీకులు ఇస్తూ అన్నీకుదిరితే దీపావళి లోపే తాను చిరంజీవిని కలిసే అవకాశం ఉంది అని సందీప్ రెడ్డి ఇస్తున్న లీకులు బయటకు రావడంతో ఇప్పుడు ఈన్యూస్ హాట్ న్యూస్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: