అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ కి  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. మొదటి సినిమా తోనే సంచలన విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఈ అమ్మడికి డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ... తన కనుసైగలతో నే హావభావాలను పండించి ప్రేక్షకుల మతి పోగొట్టింది శాలిని పాండే. ఇక అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ తో షాలిని పాండే క్రేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. అయితే మొదటి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న శాలిని పాండే కు వరుస అవకాశాలు వచ్చి పడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత 118 చిత్రంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో జోడీ కట్టింది ఈ అమ్మడు. 

 

 

 

 ఇటీవలే వచ్చిన 118 చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం శాలిని పాండే కు కొంత ఉపశమనం కలిగించింది. అయితే 118 చిత్రం విజయం తర్వాత కూడా ఈ అమ్మడికి అంత అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ పక్కన ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో శాలిని పాండే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోంది. అయితే యంగ్ హీరో రాజ్ తరుణ్  కి జోడిగా ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటిస్తున్న శాలిని పాండే ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. 

 

 

 

 కాగా  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తనకి మంచి హిట్ అందిస్తుందని నమ్మకంతో ఉంది శాలిని పాండే. అయితే ఇప్పటికే చేసిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ  షాలిని పాండే కు మాత్రం అంతలా అవకాశాలు రావడం లేదు. కాగా ప్రస్తుతం శాలిని పాండే రాజ్ తరుణ్  తో నటిస్తున్న ఇద్దరి లోకం ఒకటే సినిమా తో అయిన శాలిని పాండే కి అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. కాగా ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అవుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: