డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరియు అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు గా నిలిచాయి. దీంతో అల వైకుంఠపురములో అనే సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు కృషి చేస్తున్నారు. హారిక మరియు హాసిని క్రియేషన్స్ సంస్థ తో పాటుగా సంయుక్తంగా గీతాఆర్ట్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ అల్లు అరవింద్ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అక్కినేని సుశాంత్ మరియు సీనియర్ నటి టబు అలాగే నివేత పేతురాజ్, నవదీప్, మురళి శర్మ, సునీల్ మరియు ఇంకా చాలామంది నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.


వచ్చే సంక్రాంతికి జనవరి 12 నా విడుదల కాబోతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో యువ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన సాఫ్ట్ అండ్ మెలోడీ సాంగ్ సామజవరగమన మంచి క్రేజ్‌ను సంపాదించింది. యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. దీంతో చిత్రబృందం ఇప్పుడు ‘రాములో రాములా’ అంటూ పక్కా మాస్ బీట్ ని బయటకు వదలడానికి రెడీ అవుతుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ మరియు టీజర్ విడుదల చేస్తున్నట్లు అక్టోబర్ 21 వ తారీకున సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమయంలో రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


అంతేకాకుండా సినిమా సాంగ్ కి సంబంధించి అల్లు అర్జున్ చేతిలో మందు గ్లాస్ తో పాటు స్టెప్ వేస్తున్న మూమెంట్ కూడిన పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే సాంగ్ రిలీజ్ కాకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెంది నా పేరు సూర్య తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని సినిమా ఒప్పుకొని లేట్ చేసి...ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇలా చేయడం ఏంటి బన్నీ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: