బాలీవుడ్‌ టాప్‌ హీరోలైన హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ సినిమా వార్‌.. ఈ సినిమా ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో షాహిద్‌ కపూర్‌ ‘కబీర్‌ సింగ్‌’ మాత్రమే రూ.276కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు ‘వార్‌’ ఆ రికార్డును అధిగమించింది. 

 

ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్‌ చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా వార్‌ రికార్డులకెక్కింది.చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌ చిత్రాలు రావాలి. అవి మాత్రమే వసూళ్లను కురిపించగలవు. అవి మాత్రమే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలవు. ఆర్థికంగా బలోపేతానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు.హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ‘వార్‌’ చిత్రాన్ని విడుదల చేశారు.

 

అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన బాలీవుడ్‌ టాప్‌-10 చిత్రాల్లో ‘వార్‌’ 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ‘బాహుబలి’ మొదటి స్థానంలో ఉండగా, ‘దంగల్‌’, ‘సంజూ’, ‘పీకే’, ‘టైగర్‌ జిందాహై’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘పద్మావత్‌’, ‘సుల్తాన్‌’, ‘ధూమ్‌3’, తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: