దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది.
రామ్ చరణ్ ఈ సినిమాలో
అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.
రామ్
చరణ్ కు జోడీగా
అలియా భట్ ఈ సినిమాలో నటిస్తుండగా ఎన్టీయార్ కు జోడీగా ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయం మాత్రం తెలియటం లేదు. మొదట జూనియర్ ఎన్టీయార్ కు జోడీగా
డైసీ ఎడ్గర్ జోన్స్ అనే హాలీవుడ్ నటిని రాజమౌళి ఎంపిక చేశాడు. కానీ కొన్ని కారణాల వలన
డైసీ ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తప్పుకుంది.
డైసీ తరువాత అమెరికాకు చెందిన ఎమ్మా రాబర్ట్స్ జూనియర్ కు జోడీగా ఫైనల్ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఎమ్మా రాబర్ట్స్ గురించి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయకముందే ఎమ్మా రాబర్ట్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంపిక చేసిన హీరోయిన్లు తప్పుకోవటంతో
రాజమౌళి ఎంపికైన హీరోయిన్ వివరాలను ప్రకటించటం లేదని తెలుస్తోంది. ఎన్టీయార్ కు జోడీగా ఒక హాలీవుడ్ హీరోయిన్ ఎంపికైందని ఆ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటోందని తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ గురించి కూడా
రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా 9 నెలల సమయం ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ఇప్పుడే వద్దని
రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఒకే కాలానికి చెందిన వారే అయినప్పటికీ వీరిద్దరూ స్వాతంత్ర్యం కోసం వేరువేరుగా పోరాటం చేశారు. వీరిద్దరూ కలిసి పోరాటం చేసి ఉంటే ఏ విధంగా ఉంటుందనే కల్పితమైన కథతో
రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.