అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వస్తోన్న చిత్రం ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’. ఈ మూవీ నుంచి రాములో రాములా నన్నాగమ్ చేసిందిరో అంటూ సాగే పాట టీజర్ ను చిత్రయూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ పాటలో అల్లు అర్జున్, పూజాహెగ్డే కలిసి వేసే స్టెప్పులను ప్రేక్షకులు  బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రాములో రాములా పాటను కాసర్ల శ్యామ్ రాయగా..అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు.. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని మరోపాట టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

‘రాములో.. రాములా’ అనే పాట టీజర్‌ను అల్లు అర్జున్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘రాములో.. రాములా.. నన్నాగం జేసిందిరో’ అంటూ 26 సెకన్లపాటు సాగే ఈ మాస్ సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో బన్నీ లుక్స్ ప్రదానంగా  ప్రేక్షకుల్ని  ఆకర్షణ చేస్తున్నాయి. ఈ పాటని అక్టోబర్ 26వ తేదీన విడుదల చేస్తున్నట్లు టీజర్ చివర్లో తెలిపారు.
 
కాగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.రాధా కృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. హీరో సుశాంత్, టబూ, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్, నవదీప్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి పండుగ కానుకగా .. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్.


మరింత సమాచారం తెలుసుకోండి: