మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా మెగా హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఆయన చేసిన సినిమాలు చాలానే విజయాలు సాధించినప్పటికీ... ఆయనలోని నటుడుని ప్రూవ్ చేసుకోవటానికి మాత్రం ఒక్క సినిమా కూడా సరిగా పడలేదు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో నటించారు.e సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ఏ హీరో కనీసం సాహసం చేయని కథనంతో ఈ సినిమా వచ్చింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన చిట్టి బాబు పాత్ర కూడా ఓ సంచలనం రేపింది. ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్ నటుడిగా ఎన్నో మెట్లు ఎదిగాడు. ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా తిరగరాసింది.అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
అయితే రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల్లోనే తన కాదు అటు నిర్మాతగా కూడా బిజీ బిజీగా మారిపోయారు. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తమిళ సినిమా రీమేక్ చేసేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. తమిళంలో ఈ మధ్య విడుదలైన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారట. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాలో ధనుష్ నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.అంతే కాకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.
అయితే ఇప్పటికే రంగస్థలం లాంటి రా కంటెంట్ చిత్రంలో నటించి విజయం సాధించాడు రామ్ చరణ్. ధనుష్ హీరోగా నటించిన చిత్రం కూడా రా కంటెంట్ కావడంతో ఈ సినిమా రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారట. అయితే దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట టాలీవుడ్ నిర్మాతలు. ఈ సినిమాలో రామ్ చరణ్ మాత్రమే సెట్ అవుతారని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ధనుష్ హీరోగా నటించిన సినిమాలో మంజు వారియర్ కథానాయికగా నటించింది. ఇదిలా ఉండగా ఒకవేళ అసురన్ సినిమా రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తే అది రామ్ చరణ్ సినీ కెరీర్ లో మరో రంగస్థలం అవుతుందని చెప్పవచ్చు.