దేవిశ్రీప్రసాద్..కొన్నేళ్ళు ఇండస్ట్రీలో మోగిపోయిన పేరు. మెగాస్టార్, తారక్, విక్రం..ఇలా స్టార్ హీరోల తో పాటలే కాదు మాంచి స్టెప్స్ కూడా వేయించాడు. తనలోని ఎనర్జీ మామూలుగా ఉండదని దేవి ఉంటే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అని అందరు ఫిక్సైపోతారు. ఇక ఆడియో ఫంక్షన్స్ లో దేవి సందడి అంతా ఇంతా కాదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో ఈ రాక్ స్టార్ బాగా సపోర్ట్ చేస్తాడు. అయితే గతకొంతకాలంగా దేవి మ్యూజిక్ ప్రేక్షకులను అంతగా మ్యాజిక్ చేయలేకపోతోంది. అంతేకాదు తమన్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి ముఖ్యంగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్యే పోటీ ఉంది. రేసులో మరికొన్ని సినిమాలున్నప్పటికీ మహేష్, బన్నీ సినిమాల మధ్య పోటీ ఇప్పట్నుంచే మొదలైంది. 

మహేష్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తే, బన్నీ మరో పోస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. మహేష్ టీజర్ రిలీజ్ చేస్తే, బన్నీ ఏకంగా సాంగ్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడీ పోటీ హీరోల మధ్య మాత్రమేకాదు, సంగీత దర్శకుల మధ్య కూడా నెలకొంది. కారణం ఒక సినిమాకి దేవి మ్యూజిక్ ఇస్తుంటే మరో సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్‌గా అల వైకుంఠపురములో సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ ఇప్పుడు సూపర్ హిట్ అయి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. సామజవరగమన అనే ఈ పాట ట్రెండ్ అవ్వడమే కాదు, 7 లక్షల లైకులతో టాప్ లో నిలిచింది. ఇప్పటివరకు బన్నీ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఒకెత్తయితే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ఒక్క సాంగ్ మరో ఎత్తుగా నిలిచింది.

తమన్ కంపోజ్ చేసిన ఈ పాట సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు అందరి చూపు దేవిశ్రీప్రసాద్ పై పడింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ ఎలాంటి సాంగ్స్ ఇచ్చాడనే ఆసక్తి ఇప్పుడు అందరిలోను మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరక్టర్స్ గా దేవిశ్రీ,, తమన్ మధ్య గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. సామజవరగమన సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో.. పోటీ ఇప్పుడు పీక్స్ లో ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇంకా పాటల విడుదల కార్యక్రమం మొదలవలేదు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాగానే సామజవరగమన సాంగ్ తో కంపారిజన్ స్టార్ట్ అవడం పక్కా అని అర్థమవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈసారి సంక్రాంతికి మహేష్ వర్సెస్ బన్నీ నే కాదు దేవిశ్రీ వెర్సెస్ తమన్ కూడా అని అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: