రాజకీయ నాయకులు సినిమా వాళ్లతో ఎప్పుడూ సత్సంబంధాలు మెయింటేన్ చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఐతే ఇక చెప్పనవసరం లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీతో మన హీరోలందరికీ కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఓ అగ్ర నిర్మాత కన్ను బిజేపీ వైపు వెళ్తుందని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ స్టెప్పుల గురించి ఎప్పటినుండో ఊహాగానాలున్నాయి.
అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే వదులుకోనని స్వయంగా రాజు గారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీ కాదు.. గ్రంథాన్నే రాసుకున్నాడు ఈయన. ఇప్పుడు రాజుగారి చూపులు రాజకీయాల వైపు వెళ్తున్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.ఇక ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన విందుకు తెలుగు ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు వెళ్లాడు.
తనకు ఎంతో మందితో పరిచయాలు ఉన్నప్పటికీ.. దక్షిణాది నుంచి మాత్రం ఎవరికీ ఆహ్వానం అందక పోగా...ప్రధాని
మోడీ కేవలం రాజుకు మాత్రమే ఇన్వి టేషన్ పంపడం కూడా చర్చకు దారితీసింది. అక్కడ ఆయనతో ముచ్చటించాడు కూడా. ఈ ఇద్దరూ దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలకు ఆయన ఇటీవల విండు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కూడా అనేక రంగాల్లో నిష్టా తులైన ప్రముఖులను, సినీ వర్గాలను కూడాఆహ్వానించారు. ఈ విషయాన్ని రాజే చెప్పుకొచ్చారు.
‘‘మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నా.“అంటూ రాజు.. ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్ పెట్టారు.ఈ భేటీలో ఈయన బీజేపీలో చేరే దానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజుల్లో దిల్ రాజు కమలనాథుల వైపు అడుగేస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై ఆయనేం అంటాడో చూడాలిక.