టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన తన కలల సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోలేనప్పటికీ, ఆ సినిమాలోని తన అత్యద్భుతన నటనకు గాను ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండడంతో ఎంతో ఆనందపడుతున్నారు. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలువురు టాలీవుడ్ నటులతో పాటు, పలు ఇతర భాషల నటులు కూడా నటించడం జరిగింది. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రూ.250 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించడం జరిగింది. 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన ఒక స్టార్ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం, అలానే ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ పని చేయాల్సి ఉండగా, ఆయనకు ప్రస్తుతం డేట్స్ ఖాళి లేకపోవడంతో మరొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని వెతికే పనిలో దర్శకుడు కొరటాల శివ వెతుకులాట ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాక ఈ సినిమా కోసం సైరా మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని కూడా ఎంపిక చేసినట్లు వార్తలు రావడం జరిగింది. 

అయితే అటువంటిదేమీ లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని అంటున్నారు. అంతేకాక ఈ సినిమా కోసం బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్ - అతుల్ లను సంగీత దర్శకులుగా నిన్న ఎంపిక చేసిందట సినిమా యూనిట్.  ఇటీవల బాలీవుడ్ లో తగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో, సూపర్ 30 వంటి భారీ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఈ ఇద్దరి మ్యూజిక్ కి మంచి క్రేజ్ ఉండడంతో, మెగాస్టార్ సహా దర్శక నిర్మాతలందరూ కూడా తమ సినిమాకు, వారు అయితేనే సరిగ్గా న్యాయం చేయగలరని భావించి ఫిక్స్ చేశారట. ఇక ఈ న్యూస్ పై అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్. మరి ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్తే అని చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: