అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల మరో మూడు నెలలుండగానే ప్రమోషన్స్ కూడా వేగంగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్.
ఇందులో భాగంగానే పాటలు విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సామజవారగమన పాట అయితే సంచలనాలు రేపుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సేషనల్ సాంగ్గా ఇది చరిత్ర సృష్టించింది.
అయితే ఫాన్స్ మాత్రం బన్నీ నెక్స్ట్ మూవీ కోసం అదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...ఆర్య' కాంబినేషన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్, సుకుమార్ అంటే ఆ సినిమా చాలా స్పెషల్గా వుంటుందని అంటున్నారు.కానీ ఇంతవరకు ఆ చిత్రం గురించి అఫీషియల్ అప్డేట్ లేదు.
మైత్రి మూవీ మేకర్స్ ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు అని మరియు ఈ చిత్రాన్ని ఇంకా అనౌన్స్ చేయడం లేదని నిర్మాతలపై మండి పడుతున్నారు.అల్లు అర్జున్ అభిమానులు అసలు సినిమాని వదిలేసి ఈ కొసరు సినిమాల పబ్లిసిటీ ఏమిటని గుస్సా అయ్యారు.కానీ ఇంతవరకు అల్లు అర్జున్ అయితే సుకుమార్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.