ఇండియన్ బ్యాడ్మింటన్ స్థాయిని ఆకాశానికి తీసుకు వెళ్లిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు. కొన్ని కోట్ల మందికి సింధు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఆదర్శ క్రీడాకారిణి గురించి సినిమా తీసి మరింత మందికి ఆమె విజయాలను చూపించి స్ఫూర్తిని నింపాలని ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈమద్య కాలంలో బయోపిక్ లు చాలా వస్తున్నాయి. బ్యాండ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పీవీ సింధు బయోపిక్ రూపొందబోతుందన్న వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..ఇండస్ట్రీస్ నుండి స్టార్ హీరోయిన్స్ చాలా మంది పేర్లు పీవీ సింధు బయోపిక్ కోసం అనుకుంటున్నారు. ఆ మద్య సమంత ఈ బయోపిక్ లో నటించబోతుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది. పీవీ సింధు కాస్త హైట్ ఎక్కువ.. ఆమె ఫిజిక్ ను మ్యాచ్ చేయడం అంటే కాస్త కష్టమే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పీవీ సింధు పాత్రను చేయగల సత్తా కేవలం పూజా హెగ్డేకు మాత్రమే ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక రీసెంట్‌గా పూజా ఈ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బయోపిక్ పాత్రలు చేయాలనే కోరిక నాకు చాలా ఉంది. పీవీ సింధు పాత్రలో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను అంటూ సింధు బయోపిక్ చేయాలనుకుంటున్న మేకర్స్ కు హింట్ ఇచ్చింది. మరి పూజా కు పీవీ సింధు బయోపిక్ లో మేకర్స్ ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.

ఇటీవలే 'గద్దలకొండ గణేష్' సినిమాలో శ్రీదేవి పాత్రతో అలరించిన పూజా హెగ్డే ఈ నెల 25 న బాలీవుడ్ సినిమా హౌజ్ ఫుల్-4 తో రాబోతోంది. తెలుగులో త్వరలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ 'జాన్' సినిమాలో కూడా పూజా నటిస్తోంది. ఇవి కాకుండా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇక బాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న పూజా హెగ్డే పీవీ సింధు బయోపిక్ లో నటిస్తే అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: