టాలీవుడ్‌ యంగ్ హీరో రానాపై రూమర్స్‌ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే రానా ఆరోగ్య పరిస్థితిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రానా త్వరలో షూటింగ్‌లకు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాగా బక్కచిక్కిపోయిన భల్లాలదేవుడు కండలు పెంచే పనిలో ఉన్నాడు.

 

ఇపుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' చిత్రం చేయడానికి రానా ఎప్పుడో అంగీకరించాడు. రెండు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా ఫిలిం చేయాలని సంకల్పించారు.రానాకి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ జరగడంతో అతని బాడీ సెన్సిటివ్‌గా వుంటుందని డాక్టర్లు హెచ్చరించారు.

 

ఇలాంటి సమయంలో గుర్రాలు ఎక్కి, కత్తి యుద్ధాలంటే ఫిజికల్‌గా చాలా స్ట్రెయిన్‌ వుంటుంది కనుక ప్రస్తుతానికి హిరణ్య కశ్యప వాయిదా వేసారు. మూడేళ్లుగా రానా కోసం గుణ శేఖర్‌ ఎదురు చూస్తున్నాడు కానీ మరి కొన్నాళ్లు వేచి వుండక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: