బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరబోతున్న నేపథ్యంలో ఇంటిలో వాతావరణ హాట్ హాట్ గా ఉంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు చూస్తున్న వీక్షకులకు ఆడుతున్న ఇంటి సభ్యులకు ఎంతో ఉత్కంఠ రేపే విధంగా ఉండటంతో చూస్తున్న వీక్షకులకు షో పై మరింత ఇంట్రెస్ట్ పెంచే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్ తర్వాత సోమవారం జరిగిన ఎపిసోడ్ కంటిన్యూగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ లో ఇంటిలో సభ్యులు ఆడిన గేమ్ బిగ్ బాస్ అభిమానులను చూస్తున్న వీక్షకులను ఎంతగానో అలరించాయి. 'టికెట్ టు ఫినాలే' టాస్క్ లో భాగంగా అలీ రెజా, బాబా భాస్కర్ లు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. 


టాస్క్ చూస్తున్న ఇంటి సభ్యులకు టెన్షన్ పుట్టించింది. టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన మట్టి పాత్రలో ఇద్దరూ ఒక్కోరంగు పూలను పాతాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఎవరి పూలు ఎక్కవ ఉంటాయో వారే గెలిచినట్లు. ఈ ప్రాసెస్ లో టాస్క్ కాస్త హింసాత్మకంగా మారింది. అలీ, బాబాలు ఒకరినొకరు తోసుకుంటూ రెచ్చిపోయారు.  వారిద్దరూ తలపడడం చూసిన శ్రీముఖి, శివజ్యోతిలు చాలా టెన్షన్ పడ్డారు. టాస్క్ మరింత హింసగా మారుతుండడంతో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ అలీకి వార్నింగ్ ఇచ్చారు.


చివరాకరికి ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆట రసవత్తరంగా ఉన్న సమయంలో హింసాత్మకంగా మారుతున్న తరుణంలో బిగ్ బాస్ టాస్క్ ని రద్దు చేశారు. అలీని ఎంతగా హెచ్చరించినా మాట వినకుండా బాబా భాస్కర్ పై బలప్రదర్శన చేయడంతో టికెట్ టు ఫీనాలే టాస్క్ నుండి అలీని తప్పించారు. అయితే ఆ తర్వాత చివరాకరికి ఎక్కువ బ్యాటరీ కలిగి ఉన్న రాహుల్ 'టికెట్ టు ఫినాలే' గెలవడం జరిగింది. దీంతో ఇంటిలో ఉన్న వరుణ్, అలీ, శ్రీముఖి, బాబా, శ్రీముఖి, శివజ్యోతిలు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: