ఇప్పటికే రాబోయే సంక్రాంతి సందర్భంగా రాబోతున్న సినిమాల విషయమై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫ్యాన్స్ మధ్య హడావుడి మొదలయింది. ఆయా హీరోల అభిమానులు మా హీరో సినిమా బాగా ఆడుతుంది అంటే, మా హీరో సినిమా బాగా ఆడుతుంది అంటూ చర్చించడం మొదలెట్టేశారు. ఇక మన టాలీవుడ్ నుండి ఇద్దరు అగ్ర హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బెర్త్ ని రిజర్వు చేసుకున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రెండు బడా సినిమాలు కూడా ఒకే రోజున రాబోతుండడంతో, ఆ సందడి మరింతగా పెరగనుంది. 

ఇక ఇప్పటికే బన్నీ తన సినిమా ప్రమోషన్స్ తో అదరగొడుతుంటే, మరోవైపు సరిలేరు టీమ్ కూడా రాబోయే దీపావళి నుండి తమ సందడిని షురూ చేయనుంది. ఇకపోతే సంక్రాంతి రేసులో నిలుస్తున్న బడా సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా కూడా ఉండబోతోంది. మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో మాస్ మరియు కమర్షియల్  ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, మరొక హీరోయిన్ నివేథా థామస్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం ఇప్పటివరకు మొదలు కాకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ తన సినిమాల ప్రమోషన్స్ విషయమై ఎంతో దూకుడుగా ఉండే మురుగదాస్, తమ హీరో సినిమా విషయమై నెమ్మదించడంతో కొందరు రజిని ఫ్యాన్స్  ఆగ్రహిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: