సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీని దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. పొంగల్ వార్ లో నువ్వా నేనా అనేలా బన్ని, మహేష్ ల ఫైట్ ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.


ఇప్పటికే సినిమా నుండి టైటిల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. అయితే ఈమధ్య తన మ్యూజిక్ మీద వస్తున్న నెగటివ్ కామెంట్స్ కు సమాధానం చెప్పేలా సరిలేరు నీకెవ్వరు సినిమా ఆల్బం చేస్తున్నాడట డిఎస్పి. సినిమా నుండి ఇప్పటివరకు ఒక సాంగ్ మాత్రమే వచ్చింది. దీవాళికి సర్ ప్రైజ్ ఫస్ట్ లుక్ టీజర్ ఒకటి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


ఇప్పటికే సంక్రాంతికి పోటీలో దిగే అల వైకుంఠపురములో సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మహేష్ సినిమాకు సంబందించి ఒక సాంగ్ మాత్రమే వచ్చింది. అందుకే దీవాళి కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని ఆశిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలిసిందే.


సినిమా యూనిట్ మాత్రం సినిమా రష్ చూసే పక్కా హిట్ అనేస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి ఈ సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ కొట్టేలా ఉన్నాడు. మహేష్ కూడా భరత్ అనే నేను, మహర్షి సినిమాల బ్యాక్ టూ బ్యాక్ హిట్లు తర్వాత వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: