బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీయస్ట్ హీరోయిన్లలో అలియా భట్ ది టాప్ ప్లేస్. గల్లీ బాయ్, కళంక్.. వంటి హిట్స్ తో అలియా బీ టౌన్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం అలియా పెళ్లి గురించి ఓ వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అలియా-రణబీర్ పెళ్లి చేసుకోబోతున్నారని రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమైద్ ప్యాలస్ లో జరుగనుందని ఆ వార్త సారాంశం.
అమ్మాయిల కలల హీరో రణబీర్ కపూర్ తో అలియా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరి విహార యాత్రలు, బీచ్ ఫోటోలు నెట్లో షికారు చేస్తున్నాయి. వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అందులో.. వీరి పెళ్లి 22 జనవరి' 2020లో జరుగుతుందని ఉంది. అయితే.. ఆ శుభలేఖలో ఉన్న తప్పులు ఆసక్తి రేపాయి. అలియా తండ్రి మహేశ్ భట్ అయితే.. ముకేశ్ భట్ అని ఉంది. ఇంగ్లీష్ లో 22nd కు బదులు 22th అని ప్రింట్ అయి ఉంది. అలియా పేరు కూడా తప్పుగా ప్రింట్ అయి ఉండి. దీంతో ఆ పెళ్లి పత్రిక ఫేక్ అని తేలిపోయింది. ఎవరో ఆకతాయిలు వీరి పెళ్లి శుభలేఖ అంటూ రాంగ్ ప్రింట్ చేసి నెట్లో వదిలారు. ఇంకేముంది.. అసలే హాట్ లవర్స్, బీ టౌన్ చూపు కూడా వారి మీదే ఉండటంతో ఈ శుభలేఖ క్షణాల్లో వైరల్ అయిపోయింది.
అభిమానులు అలియా జంటకు శుభాకాంక్షలు చెప్తుండటంతో ఈ వార్తను అలియా ఖండించింది. అటువంటి ప్రయత్నాలేమీ లేవని నమ్మొద్దని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్. అలియా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. బ్రహ్మాస్త్ర, సడక్2 తో పాటు టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. వచ్చే ఏడాది చివరి వరకూ ఖాళీ లేని అలియా తీరికలేని షెడ్యూల్స్ తో బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: