తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ సినిమాకు కేవలం తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు అందిస్తున్నారు. రీసెంట్ గా సినిమా చూసిన మహేష్ సినిమా సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. తమిళంలో హిట్ అయ్యింది కాబట్టి మన వాళ్ల కన్ను పడటం కామన్. అసురన్ సినిమా మీద కూడా తెలుగు దర్శక నిర్మాతల చూపు పడ్డదట.


ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. వెట్రిమారన్ డైరక్షన్ లో వచ్చిన అసురన్ సినిమాలో ధనుష్ మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. తెలుగులో అసురన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉండగా ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.


సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది తర్వాత కాని ఇందులో నటించే స్టార్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. రంగస్థలం సినిమాతో చిట్టిబాబుగా చితక్కొట్టిన రాం చరణ్ అసురన్ మూవీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కూడా తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది నిర్ణయించుకోలేదు. కుదిరితే అసురన్ గా తారక్ కూడా చేయొచ్చని టాక్.


దాదాపుగా ఈ రీమేక్ లో ఈ ఇద్దరిలో ఒకరు చేసే అవకాశాలు ఉన్నాయట. రంగస్థలంలో రాం చారణ్ తన నటనతో మెప్పించగా అలాంటి క్యారక్టరైజేషన్ తో వచ్చిన అసురన్ లో అతను అయితే పర్ఫెక్ట్ అని అంటున్నారు. కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న చరణ్ అసురన్ పై ఓ ఫైనల్ డెశిషన్ కు రావాల్సి ఉంది. ఒకవేళ ఈ రీమేక్ లో చరణ్ నటిస్తే మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: