మంచు లక్ష్మి ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో  ఆమెకు కలిసిరాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. బుల్లితెర కార్యక్రమాలను ప్రజెంట్ చేయడంలో చాల అనుభవం ఉన్న ఈ మంచు వారి అమ్మాయి తాను లేటెస్ట్ గా హోస్ట్ చేస్తున్న ఈ షోపై చాల ఆశలు పెట్టుకుంది. 

బాలీవుడ్ చాట్ షోల తరహాలో బోల్డ్ స్టైల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంచు లక్ష్మి ఫిలిం ఇండస్ట్రీలో కొంచం బోల్డ్ గా మాట్లాడే సెలెబ్రెటీలను ఏరికోరి ఎంపిక చేసుకుని ఆమె తన షోకు తీసుకు వచ్చింది. వారిచేత వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వారి అలవాట్లు అదేవిధంగా వారి లివింగ్ రిలేషన్ షిప్ విషయాలు అన్నీ చాల వివరంగా చెప్పిస్తున్నా ఎందుకో బుల్లితెర ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ కు కనెక్ట్ కావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి శృతి హాసన్ ఈమధ్య జరిగిన మంచు లక్ష్మి షోకి వచ్చి తన మద్యం అలవాటు గురించి ఆ అలవాటు మానడానికి పడ్డ పాట్లు గురించి చెప్పినా ఈ షోకు పెద్దగా రేటింగ్స్ రాక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో ఈ కార్యక్రమం ఎందుకు ఫెయిల్ అయింది అన్న కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. 

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు హాస్యంతో కూడిన కార్యక్రమాలలో బూతు అర్ధాలు ఉన్నా ఇష్టపడతారు కానీ కేవలం జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ చేసిన తప్పులను సెలెబ్రెటీలు చెప్పినా పెద్దగా ఇష్టపడక పోవడం అన్న కారణం ఈషో ఫెయిల్యూర్ కు ఒక కారణం అని అంటున్నారు. దీనికితోడు ఇలాంటి షోలు కేవలం పట్టణ ప్రాంత బుల్లితెర ప్రేక్షకులకు నచ్చుతాయి కానీ గ్రామీణ నేపధ్యంలో ఉండే బుల్లితెర ప్రేక్షకులకు ఇలాంటి కార్యక్రమాలు నచ్చవు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఇప్పటికే నిర్మాతగా నటిగా ఎదురు దెబ్బలుతిన్న ఈ మంచు వారి అమ్మాయికి ఇప్పుడు బుల్లితెర పై కూడ ఊహించని షాక్ తగిలిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: