సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు".
సంక్రాంతి కానుకగా ఈ
సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి పోటీగా బన్నీ "అల వైకుంఠపురములో" కూడా అదే రోజున విడుదల అవుతుంది. అయితే బన్నీ చిత్రం నుండి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. కానీ
మహేష్ చిత్రం నుండి పోస్టర్స్ తప్ప ఎలాంతి అప్డేట్స్ రావట్లేదు.
అయితే ఈ
దీపావళి కానుకగా ఏదైనా ఒక పాటని రిలీజ్ చేయాలని అభిమానుకు కోరుకుంటున్నారు.
అల వైకుంఠపురములో సినిమాలోని "సామజవరమగనా" సాంగ్ సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సమయంలో
మహేష్ మూవు నుండి పాటని ఎక్స్ పెక్ట్ చేయడమ్ ఏమాత్రం తప్పు కాదు. కానీ చిత్ర బృందం ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. దీపావళికి కూడా పోస్టర్ తోనే సరిపెడతారని టాక్.
అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ సారి
మహేష్ పోస్టర్ కాదట. దాదాపు పదమూడు ఏళ్ళ తర్వాత మేకప్ వేసుకున్న
విజయశాంతి గారి లుక్ ని
దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారట. సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయ శాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ రోల్ చేస్తుండగా, ఆమె పాత్ర ను దీపావళికి పరిచయం చేయనున్నారు. 2006లో నాయుడమ్మ చిత్రం తరువాత పొలిటికల్ గా బిజీ అయిన రాములమ్మ సినిమాలకు దూరంగా ఉంది.
ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు,
అనిల్ సుంకర,
మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా,
రష్మిక మందాన మొదటి సారి
మహేష్ తో జత కట్టింది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది
జనవరి 12న
సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.