నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించారు. నందమూరి బాలకృష్ణ సినిమా కెరీర్ లో అద్భుతమైన విజయం అందుకున్న చిత్రం భైరవ ద్వీపం. మాస్ హీరోగా వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో బాలకృష్ణ భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రంలో నటించారు. 
 
ఈ సినిమాలో బాలకృష్ణ కొన్ని నిమిషాల పాటు కురూపి పాత్రలో నటించారు. సాధారణంగా ఆ రోజుల్లో స్టార్ హీరోలు అలాంటి పాత్రల్లో నటించటం అంటే సాహసమే అని చెప్పాలి. గ్లామర్ హీరోగా ఇమేజ్ ఉన్న బాలకృష్ణ కథ, దర్శకునిపై ఉన్న నమ్మకంతో ఆ పాత్రలో నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భైరవ ద్వీపం సినిమాలోని బాలకృష్ణ నటించిన కురూపి పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 
 
బాలకృష్ణ కురూపిగా కనిపించే సన్నివేశాల మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని, ఒకసారి మేకప్ వేస్తే సాయంత్రం వరకు తీయడానికి వీల్లేదని దర్శకుడు సింగీతం చెప్పారు. కురూపి వేషంలో నటించిన పది రోజులు బాలకృష్ణ కేవలం జ్యూస్ లు మాత్రమే తాగేవారని సింగీతం చెప్పారు. ఒక సన్నివేశంలో బాలకృష్ణ శాపం తల్లి తీసుకుంటుందని తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ బాలకృష్ణ వస్తూ ఉంటే ముళ్లు గుచ్చుకున్నాయని అయినా బాలకృష్ణ లెక్క చేయలేదని సింగీతం చెప్పారు. 
 
భైరవద్వీపం సినిమాలో బాలకృష్ణ కురూపిగా నటించాడనే విషయం థియేటర్ లో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదని బాలకృష్ణను కురూపి పాత్రలో చూడగానే అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారని సింగీతం ఈ సినిమా విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ కే యస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో లేదా సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: