బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి పరిచయం చేశారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆ సినిమాతోనే ప్రభాస్ స్టార్ డమ్ కూడా  ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు అభిమానులు కూడా విపరీతంగా పెరిగిపోయారు. ఎంత చెప్పుకున్న బాహుబలి సినిమా కోసం ఏదో ఒక కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది. తాజాగా  ఆరు అడుగుల ఆహానుభావుడు ప్రభాస్‌కు చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు దర్శకుడు రాజమౌళి.

బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ భారీకాయంతో కనిపించేందుకు చాలా కష్ట పడారు అని, కొన్నాళ్లు విపరీతంగా తింటూ... ఇంకొన్నాలేమో తినకుండా, డైట్ పాటిస్తూ రానా, ప్రభాస్ కష్టపడ్డారన్నారు.ప్రభాస్ నెలలో ఒక్కరోజు తన ఇంటినుంచి 15 రకాల బిర్యానీలను తెప్పించుకొని లాగించేసేవాడని తెలిపారు రాజమౌళి.

టేబుల్‌పై రకరకాల బిర్యానీలు, ఫిస్ కర్రీలు, వేపుళ్లు ఎన్ని ఉన్నా కూడా.. ప్రభాస్‌కు మాత్రం అవి సరిపోయేవి కాదు. ప్రభాస్ బావమరిది తన కోసం, స్పెషల్ గా  దాదాపుగా అన్నిరకాల బిర్యానీలను ఫిల్మ్‌సిటీకి తీసుకొచ్చేవారన్నారు. ఎన్ని వెరయిటీలు చేసినా ప్రభాస్,ఇంకా ఒక్కటి తక్కువ ఉంది అనేవారంట.ప్రభాస్ తెల్లవారు జామునే వాలీబాల్ ఆడి భోజనానికి వచ్చేవారని చెప్పారు రాజమౌళి.
 
దాదాపు అన్నిరకాల నాన్ వెజ్ ఐటమ్స్ టేబుల్‌పై ఉన్నా, 15 రకాల బిరియానీలు ఉన్న సరే వాటిని చూసిన ప్రభాస్... నెయ్యి తొక్కు పచ్చడి లేదా అని అనడిగేశాడు. ఎన్నిరకాల బిర్యానీలు ఉన్నా కూడా తొక్కుపచ్చడి లేకుండా ప్రభాస్ తిండి ప్రారంభించేవాడు కాడు,దాన్ని తిన్న తర్వాతే ప్రభాస్ మిగతా వాటి జోలికి వెళ్లేవాడు అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్ లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో  పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ, ప్రభాస్‌కు చెందిన కొన్ని ఫన్నీ విషయాల్ని అక్కడ వాళ్ళతో  పంచుకున్నారు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: