తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు,
కోలీవుడ్ స్టార్ హీరో
ధనుష్ - వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన
సినిమా 'అసురన్'.
దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ
సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసిందని
కోలీవుడ్ మీడియా సమాచారం. ఈ సినిమాలో ధనుష్.. డబుల్ రోల్లో చేయగా..
ధనుష్ కి జంటగా మంజువారియర్ నటించింది. ఈ
సినిమా చూసిన
సూపర్ స్టార్ మహేష్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'అసురన్'
సినిమా చూసిన
టాలీవుడ్ సూపర్స్టార్
మహేష్ బాబు.. 'సినిమా అద్భుతంగా ఉంది.. అసురన్ టీమ్కు కంగ్రాట్స్' అని ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పట్నుంచి చెర్రీ మనసు 'అసురన్'పై పడిందట. అందుకే ఈ
సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకునే పనిలో మెగా హీరో ఉన్నాడని ఫిల్మ్
నగర్ లో టాక్ గట్టిగానే వినబడుతుంది.
ఇక 'అసురన్'..సినిమా.. చెర్రీ నటించిన 'రంగస్థలం' తరహాలోనే ఉంటుందన్న విషయం
ధనుష్ గెటప్, ట్రైలర్స్ చూస్తే తెలుస్తుంది. ఇలాంటి బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించే కథ తనకు బాగా కలిసిరావడమే కాకుండా కెరీర్లో ఓ మైల్స్టోన్ గా నిలిచిపోవడంతో.. 'అసురన్' ను తెలుగులో రీమేక్ చేయాలని బాగా ఇంట్రస్ట్ చూపుతున్నాడట. అంతేకాదు.. ఈ
సినిమా రీమేక్ చేస్తే 'రంగస్థలం-2' కావడం ఖాయమని.. ఇది కెరీర్లో మరో బెస్ట్
సినిమా అవుతుందని కొందరు రామ్ చరణ్ కు సలహాలిచ్చారని తాజా సమాచారం. ప్రస్తుతం దర్శధీరుడు జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా తర్వాత కుదిరితే చెర్రీ అసురన్ రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట. చూడాలి మరి 'అసురన్' రీమేక్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.