సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. దీనిని మరింత పెంచే విధంగా దీపావళికి చిత్రయూనిట్ మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా తిరిగి వెండితెరపై అడుగుపెట్టబోతున్న లేడీ
సూపర్ స్టార్ విజయశాంతికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను
పండుగ కానుకగా అందించాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న రాములమ్మ( విజయశాంతి) తనదైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ చెబుతోండగా.. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న ఆమె ఏలా కన్పిస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది.
చివరగా 2006లో నాయుడమ్మ చిత్రంలో వెండితెరపై కన్పించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా మారి ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇంతకాలం తర్వాత
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఆమె ఈ చిత్రంలో పవర్ ఫుల్ రూల్ ను పోషిస్తున్నట్లు తెలుస్తుండటం కూడా మరింత జోష్ ను పెంచుతోంది
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఆర్మీ మేజర్ పాత్రతో పాటు మాస్ అవతారంలో విడుదల చేసిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మరోవైపు f2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత
అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం, కమర్షియల్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కిస్తాడని
అనిల్ కు పేరుండటం కూడా ఈ చిత్రంపై
మహేష్ అభిమానుల ఆశలను పెంచుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా
మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే అంటున్నాయి.