టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కొంత సతమతం అయిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తాను తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. ఆ సినిమాను తన సొంత సంస్థైన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించిన పూరి, చాలా వరకు లాభాలు కూడా దక్కించుకున్నట్లు టాక్. ఇకపోతే ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను కూడా అతి త్వరలో తీస్తానని ప్రకటించిన పూరి, 

సడన్ గా యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. తన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇటీవల పూరి ప్రకటించడం జరిగింది. అయితే గత కొద్దిరోజులుగా తాను నటిస్తున్న రెండు సినిమాలతో కొంత బిజీ బిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ, కొద్దిరోజుల క్రితం ప్రారంభం అయి, అర్ధాంతరంగా ఆగిపోయిన ఆనంద్ అన్నామలై సినిమాను మళ్ళి లైన్లో పెట్టడానికి సిద్దమయ్యాడట. దీనితో ఇప్పట్లో విజయ్ డేట్స్ ఖాళి అయ్యే పరిస్థితి లేదని, కాబట్టి తన తదుపరి సినిమాగా రామ్ తో డబుల్ ఇస్మార్ట్ ని మొదలు పెట్టడానికి దర్శకుడు పూరి సిద్ధమయినట్లు సమాచారం. 

అంతేకాక ఆ సినిమా కోసం అప్పుడే డైలాగ్స్ మరియు లొకేషన్స్ వంటివి పూర్తిగా సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అంతేకాక వారిద్దరి ఎంపిక కూడా మొదలైందని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ మరింత మాస్ గా ఉంటుందని, తప్పకుండా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: