శంకర్ రోబో సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన అట్లీ కుమార్.. 2013 వ సంవత్సరంలో రాజా రాణి అనే ఓ రొమాంటిక్ కామెడీ సినిమాను తెరక్కించారు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇటు తెలుగులో కూడా సినిమా భారీ హిట్ అయ్యింది.  అట్లీ మొదటి సినిమా సేఫ్ జోన్ లో తీయడం.. దానికి ఫాక్స్ స్టార్ వంటి సంస్థ ప్రొడ్యూస్ చేయడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమా తరువాత అట్లీ విజయ్ తో తేరి సినిమా తీశాడు.  


రెండో సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.  2016 లో వచ్చిన హయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఇది ఒకటి.  ఈ మూవీ తరువాత 2017 లో వచ్చిన మెర్సల్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  సోషల్ మెసేజ్ తో కూడిన ఈ సినిమా విజయం సాధించడంతో అట్లీ పేరు మారుమ్రోగిపోయింది. అట్లీనే ఇప్పుడు మరోసారి విజయ్ తో బిగిల్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో విజయ్ మూడు వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.  


బిగిల్ మూవీకి ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  సినిమాపై అంచనాలు పెరిగాయి.  దీపావళి కానుకగా సినిమా అక్టోబర్ 25 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఇటు తెలుగులో ఈ మూవీని విజిల్ గా రిలీజ్ చేస్తున్నారు.  తెలుగులో విజయ్ కు మంచి మార్కెట్ ఉన్నది. అయితే, అట్లీ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అదీ ఎన్టీఆర్ గురించి.   పాజిటివ్ వ్యాఖ్యలే అనుకోండి.  తాను  మొదట దర్శకత్వం వహించిన రాజా రాణి సినిమా దగ్గరి నుంచి తన ప్రతి సినిమాను చూసి అభినందిస్తున్న వాళ్లలో ఎన్టీఆర్ ఉన్నారని అన్నారు.  


ఎన్టీఆర్ కు తాను మంచి అభిమానిని అని చెప్పిన అట్లీ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తా అన్నాడు.  ఎన్టీఆర్ తో అట్లీ సినిమా అంటే ఆ సినిమాకు ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు రెడీగా ఉంటారు అందులో సందేహం అవసరం లేదు.  ఎందుకంటే, తమిళంలో అట్లీ ఇప్పుడు బెస్ట్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.  అట్లీ సినిమాలు కూడా అదే విధంగా ఆడుతున్నాయి.  వరసగా మూడు హిట్స్ కొట్టాడు.  నాలుగో సినిమా హిట్ కోసం రెడీ అవుతున్నాడు.  వారి అట్లీ అఫర్ ను ఎన్టీఆర్ ఆమోదిస్తాడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: