‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘గీత గోవిందం’ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక తో నటించడానికి టాప్ యంగ్ హీరోలు అందరు క్యూ కడుతున్న నేపధ్యంలో లేటెస్ట్ గా ఆమెకు ఇగో పెరిగి పోయింది అంటూ వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక మహేష్ తో నటిస్తోంది. త్వరలో ఈమె అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో మొదలుకాబోతున్న మూవీలో కూడ ఈమె లీడ్ హీరోయిన్ గా ఎంపిక అయింది.

ప్రస్తుతం రష్మికకు కొనసాగుతున్న క్రేజ్ రీత్యా ఎవరైనా దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమా విషయంలో సంప్రదిస్తే ఆమూవీలో ఎవరైనా టాప్ హీరో ఉన్నాడా అదేవిధంగా ఆమూవీ నిర్మాణ సంస్థ స్థాయి ఏమిటి అన్నప్రశ్నలు వేస్తున్నట్లు టాక్. అంతేకాదు తన పాత్ర హీరో పాత్రకు ఏవిధంగాను తగ్గని విధంగా ఉండాలని ఎక్స్ పోజింగ్ సీన్స్ అదేవిధంగా లిప్ లాక్ సీన్స్ కు తాను సహకరించనని తన డేట్స్ బట్టి హీరో డేట్స్ ఇవ్వాలని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

దీనితో రష్మికకు యాటిట్యూడ్ పెరిగిపోయింది అంటూ ప్రచారం కూడ మొదలైపోయింది. దీనికితోడు దిల్ రాజ్ నిర్మాణంలో నాగచైతన్య హీరోగా ప్రారంభించబోయే మూవీ విషయంలో రష్మిక తన పారితోషికాన్ని నాగచైతన్య పారితోషికంతో సమానంగా ఇమ్మని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు ఎవరు ఎందుకు పుట్టిస్తున్నారో క్లారిటీ లేకపోయినా రష్మిక ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా ఉండటంతో రష్మిక రంగంలోకి దిగి ఈవార్తలను ఖండించినట్లు తెలుస్తోంది. 

‘మజిలీ’ మూవీ తరువాత చైతన్య పారితోషికం 5కోట్ల స్థాయిని మించి డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో అంత పారితోషికం తనకు ఎవరు ఇస్తారు అంటూ ఆమె ఎదురుప్రశ్నలు వేస్తున్నట్లు టాక్. అంతేకాదు తాను ఒప్పుకోబోయే కథలో తన పాత్ర ఏమిటి అని వివరంగా తెలుసుకోవడం తన ఇగో ఎలా అవుతుంది అంటూ ఆమె తన పై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నట్లు తెలుస్తోంది. రష్మిక నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఆమె పై ఎవరు ఇంత పని కట్టుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖ దర్శక నిర్మాతలు అభిప్రాయ పడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: