తెలుగులో వివాదాస్పద దర్శకుడు అంటే గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ rgv.. ఈయన తెరకెక్కించే సినిమాలు తక్కువ అయినా కూడా మరొకరి సినిమాలకు అయన పెట్టె పేర్లు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అయన ఏంచేసినా కూడా నడరు చర్చలు జరిపేవారు. అలా బాగా ఫెమస్ అవుతూ అందరి నోట్లో నానుతూ వస్తున్నాడు. ఇకపోతే వర్మ ఈ మధ్య టీడీపీ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. 


ఎన్నికల ముందు వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలై ఎంత రచ్చచేసిందో తెలిసిన విషయమే.. టీడీపీ నాయకులను టార్గెట్ చేసిన వర్మ మరో సారి వారిపైన తన అస్త్రాన్ని సందిస్తున్నాడు. తాజాగా మరోసారి సినీ రాజకీయాలను షేక్ చేయబోతున్నాడు. ప్రస్తుతం అయన తెరకెక్కిస్తున్న సినిమా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌కు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో వర్మ ఈ సినిమా గురించి వెల్లడించారు వర్మ.. 


గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ దీవాళికి మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వర్మ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 27న ఉదయం 9.36 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు.మొన్న విడుదల చేసిన  పోస్టర్‌లో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ పాత్రలు ఉన్నాయి. మొత్తం మీద దీపావళి రోజు వర్మ రచ్చ చేయబోతున్నారు. 


పోయిన సారి చంద్రబాబు అసలు నిజ స్వరూపం పేరుతో ఆ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో కూడా అలాగే రాజకీయ ప్రలోపాలను రెచ్చగొడుతారా అనే విషయాలపై అందరు గుసగుసలాడుతున్నారు. ఆ సినిమాలో బాబు విలన్ అయ్యి కూర్చున్నాడు మరి ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఎం చూపిస్తారో.. ఈసారి ఎవరి మీద వర్మ ఆయుధాన్ని సంధిస్తాడో చూడాలి. ఈ సినిమాను అజయ్ మైసూర్ ప్రొడక్షన్, టైగర్ కంపెనీ ప్రొడక్షన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: