తెలుగులో వస్తున్న
బిగ్ బాస్ 3 మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
వరుణ్,
రాహుల్,
శివజ్యోతి,బాబా
భాస్కర్,
అలీ రెజా,శ్రీముఖి. అయితే గత వారం వితిక వెళ్లిపోయినప్పటి నుంచి
వరుణ్ లో కాస్త జోష్ తగ్గినట్లే అనిపిస్తుంది. మొన్నటి టాస్క్ లో
అలీ, భాబా
భాస్కర్ దాదాపు కొట్టుకున్నంత పని చేసుకున్నారు. ఇక ఫైనల్ కి
రాహుల్ ని నామినేట్ చేశాడు బిగ్ బాస్. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు.
ఇదిలా ఉంటే నిన్న కనీవినీ ఎరుగని రీతిలో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న
వరుణ్,
బాబా భాస్కర్,
అలీ,
శ్రీముఖి, శివజ్యోతిలను గార్డెన్ ఏరియాలో ఉన్న నామినేషన్ బాక్స్ లో నిలబడాలని చెప్పిన బిగ్ బాస్ వారి కోసం ఐదు టాస్క్ లను సిద్ధం చేశాడు. ఇక ఎలిమినేషన్ నుండి కాపాడుకోవడం కోసం, తమ టాలెంట్ నిరూపించుకోవడానికి బిగ్ బాస్ బుధవారం నాడు హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఎవరికి ఇష్టం ఉన్నది వారు ఎంచుకునే సౌలభ్యం ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో
వరుణ్ టాస్క్ చేయడానికి ముందుకొచ్చాడు. ఈ టాస్క్ ప్రకారం
రాహుల్ ఓ కర్రని రింగ్ లో ఉండే నిప్పుకి అంటుకోకుండా పట్టుకొని ఉండాలి.
శ్రీముఖి కి చాలా వెరైటీ టాస్క్..ఇందులో భాగంగా చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ ఉండాలి. ఇవన్నీ బిగ్ బాస్ రిలీజ్ చెప్పే వరకు చేస్తూ ఉండాలి.బాబా
భాస్కర్ ఓ పోల్ పై నిలబడి ఉండాలి.. శివజ్యోతి.. పచ్చి పాలలో గుడ్లు కలుపుకొని తాగాలి.
అలీ రెజా.. బస్తాలను కిందకి దించకుండా వాటిని గాల్లోనే ఉండేలా చూసుకోవాలి. మొత్తానికి నిన్నటి బిగ్ బాస్ లో చాలా కష్టతరమైన టాస్క్ లు చేశారు.