మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ నిర్మాణంలో ఉన్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి సంబంధించి ఒక విషయం పై దర్శకుడు అనిల్ రావిపూడి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కామెడీ ఎమోషన్ ఫన్ ఇలా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎన్ని మసాలాలు ఉండాలో అన్ని మసాలాలు కలగలిపి అనిల్ రావిపూడి ‘సరిలేరు నేకేవ్వరు’ మూవీ స్క్రిప్ట్ పై జాగ్రత్తలు తీసుకున్నాడు. 

తాను రాసుకున్న ఆ స్క్రిప్ట్‌ని ఎంతో జాగ్రత్తగా అన్ని హంగులతో తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఇతడి అనుకోని అడ్డంకులు ఎదురు అవుతున్నట్లు టాక్. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం  అందిస్తున్న విషయం  తెలిసిందే. సాధారణంగా దేవీశ్రీ బాణీలు ఉర్రూతలూగిస్తుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్ వెతుకుతూ సరికొత్త ట్రెండ్ లో పాటలు ట్యూన్ చేయడం దేవిశ్రీ ప్రసాద్ కు వచ్చు అన్న నమ్మకం ఉండేది. 

ఈ మధ్య కాలంలో దేవిశ్రీ పూర్తిగా ట్రాక్ తప్పాడు. తన పాత పాటల ట్యూన్స్ ను తిరిగి కొద్దిగా మార్పులు చేసి వినిపించి ప్రేక్షకుల అసహనానికి గురి అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలలో దేవిశ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కోసం అందించిన ట్యూన్స్ అనీల్ రావిపూడికి ఏమాత్రం నచ్చలేదు అని టాక్. దీనితో ఆ పాటల ట్యూన్స్ మార్చమని చెపుతున్నా దేవిశ్రీ పట్టించుకోకుండా అనవసరంగా టైమ్ ను తినేస్తున్నాడు అన్న ఫీలింగ్ లో అనీల్ రావిపూడి ఉన్నట్లు టాక్. 

ఈ మూవీలో ఆరు పాటలు ఉండటమే కాకుండా ఒక ఐటమ్ సాంగ్ విజయశాంతి పై ఒక ఎమోషనల్ సాంగ్ లు అనీల్ రావిపూడి దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతో కీలకమైన ఈ పాటల ట్యూన్స్ విషయంలో దేవిశ్రీ సరిగ్గా పనిచేయక పోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి అన్న విషయమై అనీల్ రావిపూడి తల పట్టుకుంటున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: