కొత్త సినిమా రిలీజ్ చేయాలంటే నిర్మాతలు తగిన సమయం చూసుకుంటారు. ఆ సమయం కోసమే ప్రేక్షకులూ ఎదురు చూస్తూంటారు. పండగ సెలవులు, స్కూళ్ల సెలవుల్లో సినిమాలు విడుదల చేసేందుకు తగిన సమయం. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో అనుకున్న సినిమాలు విడుదలవుతూంటాయి. దసరాకి సైరా, చాణక్య సినిమాలు సందడి చేశాయి. దీపావళికి తమిళ సినిమాలే వస్తున్నాయి. తరువాత వచ్చే పెద్ద పండుగ క్రిస్మస్. ఈసారి క్రిస్మస్ సందర్భంగా టాలీవుడ్ లో సందడి సంగతి ఏమో కానీ.. పోటీ ఎక్కువైంది.

 


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాటానికి డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడదే డేట్ కి మరో రెండు సినిమాలు లైన్ లోకి వచ్చాయి. రవితేజ హీరోగా వి.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ప్రతి రోజూ పండగే.. సినిమాలు కూడా తోడయ్యాయి. సహజంగా సెలవుల్లో విడుదలయ్యే సినిమాలు రోజుల గ్యాప్ లో సందడి చేస్తాయి. కానీ.. ఈ సారి మాత్రం ఒకే రోజు మూడు సినిమాలు రానున్నాయి. దీంతో ఈ సినిమాలకు పోటీ తప్పట్లేదు. ఎందుకంటే ఈ సినిమాకు నిర్మాతలు కూడా పెద్ద వారే. బాలయ్య సినిమాను సి.కల్యాణ్. రవితేజ సినిమాను రామ్ తాళ్లూరి, సాయి ధరమ్ తేజ సినిమాను అల్లు అరవింద్.. నిర్మిస్తున్నారు. దీంతో ధియేటర్లు ఎక్కువే కావాల్సి వస్తాయి.

 


టాక్ సరిగ్గా పడితే కలెక్షన్స్ వస్తాయి. లేదంటే పండుగ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాలి. ముగ్గురు దర్శకులకూ ఇంతకుముందు సినిమాల ట్రాక్ సరిగా లేదు. కాబట్టి ఈ మూడు సినిమాలకు టాక్ ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. చూద్దాం.. క్రిస్మస్ విజేత ఎవరో!


మరింత సమాచారం తెలుసుకోండి: