టాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ.  ‘శివ’ సినిమాతో సంచలన విజయం అందుకున్న రాంగోపాల్ వర్మ కెరీర్ బిగినింగ్ లో కామెడీ, హర్రర్ మూవీలకు పెద్ద పీట వేశారు.  తర్వాత మాఫియా సినిమాలు ఎక్కువగా తీస్తూ బాలీవుడ్ లో సైతం సంచలనం సృష్టించారు.  కొంత కాలంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలకు ఆదరణ తక్కువ అయ్యింది..దాంతో బాలీవుడ్ వది టాలీవుడ్ కి వచ్చేశారు.  ఇక్కడ కూడా కొన్ని సినిమాలు తీసినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  అక్కినేని నాగార్జునకు ‘శివ’లాంటి బ్లాక్ బస్టర్ విజయం అందించిన వర్మ ‘ఆఫీసర్’ మూవీతో భారీ డిజాస్టర్ ని అందించారు. 


ఇటీవల ఏపీలో ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో మరో సంచలన విషయం అందుకున్నారు.  రాంగోపాల్ వర్మ ఏదైనా బయోపిక్ తీస్తే క్యారెక్టర్స్ కూడా దాదాపు ఆ పాత్రకు తగ్గట్టుగానే తీసుకుంటారని అందరికీ తెలిసిందే. గతంలో కిల్లర్ వీరప్పన్ సినిమా అచ్చం వీరప్పన్ ని పోలిన వ్యక్తినే తీసుకున్నారు.  ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు లాంటి పాత్రలకు అచ్చం వాళ్లే వచ్చి తెరపై కనిపించారా? అన్న విధంగా తీశారు..అంతే కాదు వాయిస్ కూడా అలాగే ఉండటం గమనార్హం.


తాజాగా ఇప్పుడు వర్మ  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఆ సినిమాలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాగే మరికొంత మంది పాత్రలను రివీల్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు వైఎస్ జగన్ పాత్రతో జనాలని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. గన్ పాత్రలో మలయాళం యాక్టర్ అజ్మల్ అమీర్ కనిపించబోతు న్నాడు. అజ్మల్ గతంలో రంగం, రచ్చ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో అచ్చం సీఎం జగన్ ని తలపించేలా లుక్ ఉండటం నిజంగా షాక్ కి గురి చేసింది. ఈ మూవీ ట్రైలర్ ని వర్మ ఈ నెల 27న ఉదయం 9గంటల 36నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఈ కాంట్రవర్సీ సినిమాతో  రామ్ గోపాల్ వర్మ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: